భువనేశ్వరి కాణిపాకంలో ప్రమాణం చేయాలి: ఎమ్మెల్సీ రఘురామ్

-

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆయన అరెస్ట్ నిరసనలో భాగంగా యాత్రను స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర గురించి ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఒకవేళ తప్పు చేయలేదని భువనేశ్వరి అనుకుంటే కాణిపాకం ఆలయానికి వచ్చి వినాయకుని మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఎంతసేపు నిజం గెలవాలి అంటున్నారు.. నిజం గెలవాలంటే మీ ఆస్తుల మీద కూడా విచారణలు చేయించుకోవడానికి మీరు సిద్దమేనా అంటూ ఎమ్మెల్సీ రఘురామ్ ప్రశ్నించారు. లోకేష్ తన పాదయాత్రను మధ్యలోనే ఆపేస్తారని మేము అప్పుడే చెప్పమంటూ రఘురామ్ చెప్పుకొచ్చారు.

ఇక ఇటీవల వివాదంగా మారిన చంద్రబాబు లెటర్ గురించి సమగ్రమైన విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. చంద్రబాబుకు వ్యవస్థలను మానేజ్ చేయగలిగే సమర్థత ఉందని చెప్పారు రఘురాం. ఈ కామెంట్స్ పై టీడీపీ నుండి ఎవరైనా స్పందిస్తారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news