మ‌హువ మొయిత్ర నా బిడ్డ లాంటింది.. లీక్డ్‌ ఫొటోల‌పై శ‌శి థ‌రూర్

-

డ‌బ్బులు తీసుకుని ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం స‌హా ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మ‌హువ మొయిత్ర‌తో కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ క‌లిసిఉన్న‌ ఫొటోలు లీక్ అవ్వడం దుమారమే రేపింది. లీక్డ్ ఫొటోల‌పై ఎంపీ శ‌శి థ‌రూర్ రియాక్ట్ అయ్యారు. మ‌హువ మొయిత్ర‌తో డిన్న‌ర్ పార్టీలో తాను క‌లిసున్న ఫొటోలు అంటూ ఆన్‌లైన్‌లో వైర‌ల్ చేస్తుండ‌టంపై శ‌శి థ‌రూర్ మండిప‌డ్డారు. ఇవి దిగ‌జారుడు రాజ‌కీయాల‌ని కొట్టిపారేశారు.

ఈ ఫొటోలు తాను బిడ్డ‌గా పిలిచే మొయిత్ర బ‌ర్త్‌డే వేడుక‌లకు సంబంధించిన‌వ‌ని వివ‌రణ ఇచ్చారు. ఈ ఫొటోల‌కు వారు “ర‌హ‌స్య భేటీ” రంగు పులిమేలా స్కెచ్ వేశార‌ని మండిప‌డ్డారు. కేర‌ళ‌లోని కొట్టాయంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ తాను మొయిత్ర బ‌ర్త్‌డే పార్టీకి హాజ‌ర‌య్యాన‌ని, ఈ వేడుక‌ల్లో దాదాపు 15 మంది పాల్గొన్నార‌ని శ‌శి థ‌రూర్ చెప్పుకొచ్చారు. త‌న సోద‌రిని కూడా ఆహ్వానిస్తే ఆమె కూడా పాల్గొన్నార‌ని అన్నారు. మ‌హువ మొయిత్ర త‌న కంటే వ‌య‌సులో దాదాపు 20 ఏండ్లు చిన్న అని, ఆమెను తాను బిడ్డ‌లాగా చూస్తాన‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news