ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు

-

లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను వారు కలవనున్నారు. సుమారు గంటపాటు లాయర్లతో కలిసి కవితతో పలు అంశాలపై చర్చించే అవకాశముంది. ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కలిసేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.

కాగా, ఆమె కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శనివారం రిమాండ్ విధించింది. అలాగే ఈడీ కస్టడీకి సైతం అనుమతించింది. అయితే రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ప్రధాన కుట్రదారు అని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news