తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

-

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఏపీలో ఒకపక్క పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో రెండు ఉపాధ్యాయ , తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు.

. ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఈ నామినేషన్ దాఖలు చేయడానికి ఈ నెల 23 వరకు గడువు ఇవ్వనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన జరగనుంది.. ఈనెల 26న నామినేషన్ ఉపసంహరణకు చివరి గడువుగా పేర్కొన్నారు. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికల మీద ప్రధాన పార్టీలు ద్రుష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news