వచ్చే నెలలో కేరళకు కవిత.. సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా

-

ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొనే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పాల్గొనున్నారు. వచ్చేనెల 2, 3 తేదీల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవితకు ఆహ్వానం పలికారు. జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు.

3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను జనవరి 1న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, బీహార్‌తోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version