పథకాలను అమలు చెయ్యడంలో వివక్ష లేదు: మోడీ

-

BJP తీసుకువచ్చిన పథకాల అమలులో ఏ వివక్ష లేదని అర్హులైన ప్రతి పౌరుడికి ప్రయోజనాలు అందుతాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అస్సాంలోని బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడారు. NDA విధానాలు అమలులో ఎటువంటి వివక్ష కూడా లేదని అన్నారు వచ్చే ఐదేళ్లలో మోడీ ఆవాస్ యోజన కింద ఇంకో 30 మిలియన్ల ఇళ్ళని అందజేస్తామని లబ్ధిదారులకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగిస్తామని అన్నారు.

అలానే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వృద్ధులకు రూ.50000 దాకా వైద్య చికిత్స అందిస్తామని అన్నారు. అన్ని వర్గాల వాళ్ళకి లబ్ది పొందే విధంగా చూస్తామని అన్నారు గతంలో ఈశాన్య ప్రజలకి విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసిందని ఆరోపించారు అస్సాం లోని 14 లోక్సభ స్థానాల్లో బిజెపి 11 అసోం గణపరిషత్ 2 యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ఒక స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news