సూర్య తిలకం వీక్షించి ఆనందాన్ని పంచుకున్న ప్రధాని మోడీ..!

-

ఎన్నికల ప్రచారం నుంచే సూర్య తిలకం ని ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు. అలానే ట్విట్టర్‌ లో ఆనందాన్ని కూడా నరేంద్ర మోడీ పంచుకున్నారు. ఇక వివరాల లోకి వెళితే.. ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం లో నల్బరీ ర్యాలీ తర్వాత, రామ్‌ లల్లా పై సూర్య తిలకం ని చూసారు. కోట్లాది మంది భారతీయుల లాగే నాకు కూడా ఇది అత్యంత భావోద్వేగ క్షణం అని సూర్య తిలకం వీక్షించి ఆనందాన్ని ప్రధాని మోడీ ఈ విధంగా పంచుకున్నారు.

అయోధ్య లో ఘనంగా జరిగే రామ నవమి చారిత్రాత్మకమైనది. ఈ సూర్య తిలక్ మన జీవితాలకు శక్తి ని తీసుకు రావాలి. సరి కొత్త కీర్తి శిఖరాలను అధిరోహించడానికి మన దేశానికి స్ఫూర్తినివ్వాలి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news