మోదీ, నేను, పవన్ జతకట్టాం. నిలబడే దమ్ము జగన్ కి ఉందా? : చంద్రబాబు

-

రాష్ట్రవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.తాజాగా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చెత్తపై పన్ను వేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు.

‘ సీఎం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కోనసీమ అంబేడ్కర్ జిల్లా పి. గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…సిద్ధం అంటున్న వారిపై యుద్ధం చేద్దామని పవన్ చెప్పారు అని తెలిపారు. 2014లో పవన్ పోటీ చేయకుండా మద్దతిచ్చారు. గోదావరి జిల్లాల ప్రజలు వన్సైడ్ తీర్పిచ్చారు అని గుర్తు చేశారు. మరోసారి నరేంద్ర మోడీ, నేను, పవన్ కళ్యాణ్ జతకట్టాం. నిలబడే దమ్ము జగన్కు ఉందా? మీరు నిలబడనిస్తారా? అని ప్రశ్నించారు.ఎన్నికలు లాంఛనమే. కూటమి గెలుస్తుంది’ అని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు

.

Read more RELATED
Recommended to you

Latest news