కైకాల మృతిపట్ల చింతిస్తున్నా: PM మోదీ

-

 

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న కైకాల సత్యనారాయణ.. ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. ముఖ్యంగా ఈయన మరణం సినీ ఇండస్ట్రీకి తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. దాంతో ఫిలింనగర్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే పలుగురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుసుపుతున్నారు.

ఇక అటు కైకాల సత్యనారాయణ మృతి పై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘ప్రసిద్ధ సినీ దిగ్గజం కైకాల గారి మరణం పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటన చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news