ఆగస్టు 5న హనుమాన్​గఢీలో మోదీ ప్రత్యేక పూజలు..!

-

ఆగస్టు 5న అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలుత హనుమాన్​గఢీ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని నిబంధనలను పాటిస్తూనే.. మోదీ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.

modi
modi

రామమందిర శంకుస్థాపన కోసం ఆగస్టు 5వ తేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో పర్యటించనున్నారు. అయితే భూమిపూజ కార్యక్రమానికి ముందు హనుమాన్​గఢీ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు మోదీ.హనుమాన్​గఢీ ఆలయంలో మోదీ నిర్వహించే పూజలు 7 నిమిషాలుంటాయని తెలుస్తోంది. ఇందులో మూడు నిమిషాల పాటు.. మోదీ ఆరోగ్యం, దేశంపై కరోనా ప్రభావం తగ్గేందుకు వేదమంత్రాలతో పూజలు నిర్వహించనున్నారు అర్చకులు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తలపెట్టిన శంకుస్థాపన మహోత్సవానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే వీటిని పర్యవేక్షించేందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ అయోధ్యలో నేడు పర్యటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది.

Read more RELATED
Recommended to you

Latest news