శబరి నిరీక్షణ ఫలించింది.. రాముడు వచ్చేసాడు: మోడీ

-

ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో మాట్లాడారు. రాముడి రాక కోసం ఎదురుచూస్తున్న శబరి నిరీక్షణ ఫలించింది అని అన్నారు. అలానే ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ క్షణాలు కాలచక్రంలో శాశ్వతంగా నిలిచిపోతాయి అని అన్నారు. రామ భక్తులందరికీ నా ప్రణామాలు. మన రాముడు వచ్చేసాడు అని మోడీ అన్నారు. ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోంది అని గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టకి హాజరు అవడం నా అదృష్టం అని మోడీ అన్నారు. అలానే రామ మందిరాన్ని న్యాయబద్ధమైన ప్రక్రియ ద్వారా నిర్మించామని చెప్పారు.

దేశం మొత్తం ఇవాళ దీపావళి చేసుకుందని అన్నారు అలానే మోడీ మాట్లాడుతూ శ్రీరాముడు భారతదేశ ఆత్మ ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టానని అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాముడు ఆలయాలను దర్శించానని అన్ని భాషల్లో రామాయణాన్ని విన్నానని మోడీ చెప్పారు రాముడు లోకానికి ఆదర్శం అని కూడా ఆయన అన్నారు అలానే రామ్ లల్లా దివ్య మందిరంలో ఉంటాడని మోడీ చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news