అల్లూరి గ్రామానికి..అవంతి ఏమి చేశారో చెప్పాలి :వైసీపీపై రెచ్చిపోయిన మోహన్‌ బాబు !

-

మంచు మోహన్ బాబు.. వైసీపీ పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అవంతి శ్రీనివాస్… అల్లూరి గ్రామానికి ఏమి చేశారో చెప్పాలని చురకలు అంటించారు మోహన్‌ బాబు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చర్ క్లబ్ లో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి జాతీయ సంబరాలు ఆవిష్కరణ మహొత్సవం జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌ బాబు మాట్లాడుతూ.. అల్లూరు గ్రామానికి తాను వచ్చి చూస్తానని.. అవంతి శ్రీనివాస్ ఏమి చేశాడో చూస్తానని మోహన్‌ బాబు తెలిపారు.

సహాయం కావాలంటే చేసే వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని.. కరోనా టైము లో మా ఫ్యామిలీ మెంబెర్స్ సింగపూర్ లో ఉండి పోతే ఆయన సహాయం చేశారని గుర్తు చేశారు. సౌత్ ఇండియా అంటే ఏంటి ? నార్త్ ఇండియా అంటే ఏంటి ? ఇంతకు ముందు పరిస్థితులు వేరు… ఇప్పటి ప్రధాని అన్ని చేస్తారని మోడీపై ప్రశంసలు కురిపించారు. రాజకీయం రాజుల నవ నాడులలో ఉంటుందని.. వాళ్ళ కి సపోర్ట్ చేస్తానన్నారు. కృష్ణ హీరోగా ఉన్న సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని గుర్తు చేశారు మోహన్‌ బాబు. చాలా మంది హీరో లు హీరో యిన్‌ లతో ఛలోక్తి లతో మాట్లాడతారు.. కానీ కృష్ణ అలా చేయరని ప్రశంసలు కురిపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news