అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ…7 లక్షల మందికి లబ్ది !

-

అమరావతి : అగ్రి గోల్డ్‌ బాధితులకు నగదు జమ చేసింది జగన్‌ సర్కార్‌. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా బాధితుల ఖాతాల్లో నగదు జమ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. అగ్రి గోల్డ్‌ లో రూ. 10 వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన డిపాజిటర్లను ప్రభుత్వం ఆదుకుంది.

3.86 లక్షల మంది డిపాజిటర్లకు 207.61 కోట్ల రూపాయలను జమ చేశారు సీఎం జగన్‌… రూ. 10 వేల నుంచి రూ. 20 వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన దాదాపు 3.14 లక్షల మంది బాధితులకు అండగా నిలించింది. 3.14 లక్షల మంది ఖాతాల్లో రూ. 459.23 కోట్ల సీఎం జగన్ జమ చేశారు. మొత్తం 7 లక్షల పై చిలుకు బాధితుల ఖాతాల్లో 666.84 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేశారు. అగ్రి గోల్డ్‌ బాధితులకు ఏపీ సర్కార్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ కు అగ్రి గోల్డ్‌ బాధితులు కృతజ్ఞతలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version