రేప్ చేసి తల్లి కొడుకుని అమ్మేసారు…!

-

ఛత్తీస్‌గడ్ లోని రాజనంద్‌గావ్ జిల్లాలో 23 ఏళ్ల మహిళను, ఆమె 4 ఏళ్ల కుమారుడిని అపహరించి హర్యానాలో విక్రయించిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసారు పోలీసులు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… మహిళకు… సయ్యద్ అనే వ్యక్తితో మంచి స్నేహం ఉంది. ఈ తరుణంలో సెప్టెంబర్ 11 న తన కొడుకుతో కలిసి తన ఇంటికి వెళ్లిందని పోలీసులు చెప్పారు. ఆమెకు మత్తుమందులతో కలిపి టీ ఇచ్చి ఆమెను కిడ్నాప్ చేసాడు.

ఢిల్లీ మరియు తరువాత హర్యానాకు రోడ్డు మార్గం ద్వారా తీసుకు వెళ్లి ఆమెను అద్దె ఇంట్లో ఉంచాడు. ఆ తర్వాత ఆమెను శుభం తివారి అనే వ్యక్తి రేప్ చేసి… సురేష్ అనే వ్యక్తికి విక్రయించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలిని ఆమె ఇంటికి పంపి ఐదుగురు నిందితులను గత ఐదు రోజులుగా అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నవంబర్ 22 న ఆమె భర్త ఫిర్యాదు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news