నాకు తెలియకుండా సభ పెడతారు.. నేనెందుకు వెళ్లాలి : ఎంపీ కోమటిరెడ్డి

-

తనను ఓడించాలని ప్రయత్నించిన చెరుకు సుధాకర్ కాంగ్రెస్ చేరాక.. తన చండూరు సభకు వెళ్లాలా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. తనకు తెలియకుండా పెడుతోన్న సభకు ఎందుకు వెళ్లాలని అన్నారు. రూపాయి ఖర్చు పెట్టకుండా.. తనను ఎంపీగా ప్రజలు గెలిపించారని తెలిపారు. పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేసి అవమానించారని మండిపడ్డారు. తను ప్రజల కోసం ఎంతో చేశానని చెప్పారు. భువనగిరి అభివృద్ధికి.. కాంగ్రెస్ పార్టీకీ కట్టుబడి పని చేసే వ్యక్తినని స్పష్టం చేశారు.

దిల్లీలో అమిత్ షాను కలిసి తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వివరించానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. లోక్ సభలో వరదల గురించి ప్రస్తావించినట్లు వెల్లడించారు. ఇవాళ ఉదయం నుంచి సమావేశాలతో బిజీగా ఉన్నానని అన్నారు. కేంద్రాన్ని తెలంగాణలో ఏరియల్ సర్వే చేసి వరదల వల్ల జరిగిన నష్టాన్ని చూడాలని కోరానని చెప్పారు. తాను పదవుల కోసం వెంటబడే వాడిని కానని వెంకట్ రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధికి తనకు బెస్ట్ ఎంపీ అవార్డు వస్తుందని చెప్పారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తి కాదని.. ప్రజా సమస్యల కోసం పోరాడేవాడినని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news