హుటాహుటిన తాడేపల్లికి పిల్లి సుభాష్ చంద్రబోస్… !

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి చెందిన కొన్ని నియోజకవర్గాలలో వర్గ పోరుతో సీఎం జగన్ కు తలనొప్పిగా తయారయింది అని చెప్పాలి. ఇక తాజాగా రామచంద్రపురం లోనూ వైసీపీకి చెందిన ఇద్దరు నాయకులు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మరియు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు మధ్యన విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ కు తెలిసినా సర్దుకుంటారులే అనుకున్నారు , కానీ ఇప్పుడు రోజు రోజుకి సమస్య పెరుగుతుండడంతో దీనిని పరిష్కరించే దిశగా సీఎం జగన్ అడుగులు వేయడం గమనార్హం. అందులో భాగంగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు జగన్ నుండి పిలుపు వచ్చింది. కాసేపటి క్రితమే పిల్లి సుభాష్ చంద్రబోస్ హుటాహుటిన తాడేపల్లికి బయలు దేరి వెళ్లారు. మరి సీఎం జగన్ తో కలిసి అంతర్లీనంగా ఉన్న తన సమస్యను చెప్పుకునే అవకాశం ఉంది.

కాగా జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో చర్చించాక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news