బ్రేకింగ్: త‌హ‌శీల్దార్ విజయారెడ్డి హ‌త్య కేసులో నిందితుడు సురేష్ మృతి..

-

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ విజయారెడ్డి మర్డర్‌పై రాజకీయ దుమారం రేగుతోంది. విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ 65శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. అయితే సురేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించ‌డంతో కొద్ది సేప‌టి క్రిత‌మే మృతి చెందారు. మరికాసేపట్లో అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించనున్నట్ల సమాచారం. కాగా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డిపై రైతు సురేశ్‌ సోమవారం పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విజయారెడ్డి తన కార్యాలయంలోనే మృతి చెందారు. ఇక ఆమెతో పాటు నిందితుడు సురేశ్‌కు కూడా నిప్పంటుకోవడంతో 65 శాతం గాయాల పాలైన అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ ఇప్ప‌టికే వాంగ్మూలం ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news