టీమిండియాకు ధోని సలహాలు…ఫోటోలు వైరల్

-

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత జట్టులో మరోసారి ప్రత్యక్షమయ్యారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో టి20 మ్యాచ్ సందర్భంగా భారత జట్టుతో కలిసి ముచ్చటించారు. ఇటీవల జరిగిన తన 41 పుట్టినరోజు సందర్భంగా వింబుల్డన్ మ్యాచ్ ను తిలకించారు మహేంద్రసింగ్ ధోని.

ఈ సందర్భంలోనే ఎడ్జ్ బస్టాన్ లో ఉన్న టీమిండియాను కలిశారు మహేంద్ర సింగ్ ధోని. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. గ్రేట్ ధోని మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారు అంటూ ఈ ఫోటోలను బిసిసిఐ కూడా పోస్ట్ చేసింది.

కాగా.. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టి20 లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. విధంగా 49 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఇండియా విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో నాలుగో సిరీస్ గెలుస్తుంది టీమిండియా. 17 ఓవర్లలోనే 121 పరుగులకు ఇంగ్లాండ్ ను ఇండియా ఆల్ అవుట్ చేసింది. దీంతో టీమిండియా విజయం సాధించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news