నేను సీఎం కావడం కోసం కోట్లు ఖర్చు పెడతారు : ముద్రగడ బహిరంగ లేఖ

-

తూర్పుగోదావరి : ప్రజలకు కాపు ఉద్యమనేత ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. కొత్త రాజకీయ పార్టీ రావాలంటూ ఇటీవల తాను రాసిన లేఖపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కు ముద్రగడ కౌంటర్ గా మరో లేఖ రాశారు. ఈ మధ్య నేను వ్రాసిన లేఖలకు చాలా మంది పెద్దలు భుజాలు తడుముకుంటున్నారని లేఖలో వివరించారు. గత 5 సంవత్సరాల నుంచి దళిత, బిసి నాయకులు మూడవ ప్రత్యామ్నాయం గురించి చర్చిస్తున్నారని తెలిపారు ముద్రగడ.

మా కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తోంది..తాను ముఖ్యమంత్రి అవుతానంటే కోట్లు ఖర్చు పెట్టే స్నేహితులు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.తాను కొత్త పార్టీ అంటే భుజాలు తడుముకునే వారు సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారని ఆగ్రహించారు. వారి పోస్టింగులకు తాను బెదిరిపోయి పారిపోను, బెదరనని లేఖలో ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాగా.. ఇటీవలే బీసీ, దళితులను ఉద్దేశించి ముద్రగడ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news