ఎదురులేని ముంబై ఇండియన్స్… వరుసగా నాలుగో విజయం

-

మహిళల ప్రీమియర్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఎనిమిది వికెట్లతో యూపీ వారియర్స్ ను ఓడించింది. ముంబైకిది వరుసగా నాలుగో విజయం.

కాగా, టాస్ నెగ్గి తోలుత బ్యాటింగ్ కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఓపెనర్, కెప్టెన్ అలీసా హీలి, తాలియా మెక్ గ్రాత్ రాణించారు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది.

యస్తిక భాటియా, నట్ సీవర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ యూపీ బౌలర్లను ధనాధన్ ఆటతో హడలెత్తించారు. సోమవారం జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news