కోవిడ్ వ‌చ్చింద‌ని భార్య‌కు చెప్పి.. ప్రియురాలితో వేరే కాపురం పెట్టాడు..!

-

ముంబైలో షాకింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి త‌న‌కు కోవిడ్ వ‌చ్చింద‌ని త‌న భార్య‌కు చెప్పి ప్రియురాలితో వేరే ప్రాంతానికి వెళ్లి ఆమెతో క‌లిసి జీవించ‌డం మొద‌లు పెట్టాడు. బాధిత మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. వారు ఆ వ్య‌క్తి కోసం తీవ్రంగా గాలించారు. ఎట్ట‌కేల‌కు అత‌న్ని వారు ప‌ట్టుకుని తిరిగి భార్య‌కు అప్ప‌గించారు.

mumbai man tells his wife that he got covid 19 and flees with lover

ముంబైలోని న‌వీ ముంబై ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి త‌న‌కు కోవిడ్ సోకింద‌ని, చ‌నిపోతున్నాన‌ని భార్య‌కు చెప్పాడు. అనంత‌రం త‌న ఫోన్‌ను స్విచాఫ్ చేశాడు. త‌న బైక్‌ను బంధువుల ఇంటి ద‌గ్గ‌ర వ‌దిలేశాడు. త‌రువాత త‌న ప్రియురాలితో క‌లిసి మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్‌కు పారిపోయాడు. అక్క‌డ పేరు మార్చుకుని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అత‌ను త‌న ప్రియురాలితో క‌లిసి జీవించ‌డం మొద‌లు పెట్టాడు. జూలై 24వ తేదీన అత‌ను అలా త‌న‌ భార్య‌కు చెప్పి త‌రువాత క‌నిపించ‌కుండా పోయాడు.

కాగా బాధిత మ‌హిళ స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. వారు మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకుని అత‌న్ని వెదికే ప‌నిలో ప‌డ్డారు. అయితే అత‌ని ఫోన్ స్విచాఫ్ వ‌స్తుండ‌డంతో అత‌న్ని ట్రేస్ చేయ‌డం క‌ష్టంగా మారింది. అయిన‌ప్ప‌టికీ అత‌ను ఎట్ట‌కేల‌కు ఫోన్‌ను ఆన్ చేయ‌డంతో సెల్‌ఫోన్ ట‌వ‌ర్ సిగ్న‌ల్ ద్వారా అత‌ను ఇండోర్ లో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారు అత‌న్ని తిరిగి న‌వీ ముంబైకి తీసుకువ‌చ్చి త‌న భార్య‌కు అత‌న్ని అప్ప‌గించారు.

Read more RELATED
Recommended to you

Latest news