రాజ్‌కుంద్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఇవాళ నటి షెర్లీన్ చోప్రాను విచారించనున్న పోలీసులు

-

ముంబై: పోర్ట్ వీడియోల కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇప్పటికే ఆయనను పోలీస్ కస్టడీనికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు మరింత కూపీ లాగుతున్నారు. కుంద్రాపై బలమైన సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. పలువురికి సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసులో ప్రముఖంగా నటి షెర్లీన్ చోప్రా పేరు వినిపిస్తోంది. దీంతో ఆమెకు పోలీసులు సమన్లు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ముంబై క్రైమ్ బ్యాంచ్ పోలీస్ ఆఫీసుకు రావాలని సమన్లలో పేర్కొన్నారు. అయితే మరికొంత మంది జాబితాను కూడా పోలీసులు తయారు చేసినట్లు తెలుస్తోంది. షెర్టీన్ చోప్రా విచారణ అనంతరం వారందరికి కూడా సమన్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కేసులో ఇప్పటికే శిల్ప శెట్టిని కూడా విచారించారు.

రాజ్‌కుంద్రాకు చెందిన వియాన్ కంపెనీలో కూడా సోదాలు చేశారు. పలువురు ఉద్యోగుల నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ కేసులో నలుగురు ఉద్యోగులను సాక్షులుగా చేర్చారు. ఈ రోజు నటి షెర్లీన్ చోప్రా విచారణలో కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరి షెర్టీన్ చోప్రా ఏం చెబుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news