మునుగోడు ఓటర్ల ఉత్సాహం.. 3 గంటల వరకు 60 శాతం పోలింగ్

-

మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక ఓటింగ్ జోరుగా సాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఓటర్లు భారీగా తరలివెళ్తున్నారు. వృద్ధులు, మహిళలు, యువత ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వికలాంగులు, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

మునుగోడులో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతంగా నమోదైన పోలింగ్.. 11 గంటల వరకు 25.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3 గంటల వరకు పోలింగ్ 60 శాతానికి చేరిందని ఎన్నికల అధికారులు తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పోలింగ్‌ కేంద్రాలకు తమంతట తాము రాలేని పరిస్థితుల్లో ఉన్న వారి కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో వైద్య సదుపాయం అందుబాటులో ఉంచారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు నియోజకవర్గవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాలను సందర్శిస్తూ.. సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అభ్యర్థులు కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news