నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని జైల్లో పెట్టారు: మురళీమోహన్

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సిఐడి పోలీసులు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మరియు చంద్రబాబు మద్దతుదారులు స్పందిస్తూ ఈ అరెస్ట్ అక్రమం అంటూ ప్రభుత్వాన్ని మరియు సిఐడి పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి సినీనటుడు మురళి మోహన్ ఈ కేసుపై స్పందించగా, ఈయన మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయంగా ఎంత కీలకమైన వ్యక్తి .. అలాంటి వ్యక్తిని అకారణంగా జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటూ బాధపడ్డారు. నీతిగా నిజాయితీగా ప్రజల కోసం తన జీవితాంతం పనిచేసిన వ్యక్తిని ఇలా దారుణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చాలా ఘోటం అంటూ సినీ నటుడు మురళి మోహన్ తన స్పందనను తెలియచేశారు. చంద్రబాబు వెంటనే విడుదల కావాలి అంటూ మురళి మోహన్ డిమాండ్ చేశారు.

టీడీపీ నేతలు అందరూ సంయమనంతో ఉండాలంటూ మురళి మోహన్ చెప్పడం విశేషం. మరి ఈయన ఆశించిన విధంగానే చంద్రబాబు త్వరలోనే విడుదల అవుతారా లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news