80 ఏళ్ల ముసలోడిలా చూస్తున్నారు..మురళి విజయ్ సంచలన ప్రకటన

-

టీమిండియా వెటరన్ బ్యాట్స్మెన్ మురళి విజయ్ సంచలన ప్రకటన చేశాడు. ఇండియా క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు మురళి విజయ్‌. ఫారిన్ లీగ్స్ ఆడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. గత కొంతకాలంగా భారత జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న మురళి విజయ్ ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. దాంతో భారత క్రికెట్ కు వీడ్కోలు పలికి విదేశీ లీక్స్ ఆడాడని నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు ఓ ప్రకటన చేశాడు. బీసీసీఐతో తన బంధం ముగిసినట్టేనని, అవకాశాల కోసం విదేశాల వైపు చూస్తున్నట్లు వెల్లడించాడు. భారత్ లో 30 ఏళ్లు వస్తే ముసలోడిలా చూస్తున్నారని చమత్కరించాడు. వాళ్లు మమ్మల్ని వీధిలో నడుస్తున్న 80 ఏళ్ల వృద్దులుగా చూస్తారు. అయితే నేను ఎలాంటి వివాదాలు చేయాలనుకోవడం లేదు. మీడియా కూడా దీన్ని భిన్నంగా చూడాలి. ప్రస్తుతం నేను సాధ్యమైనంత వరకు మంచి ఆటతీరుని కనబరుస్తానని భావిస్తున్న అని మురళీ విజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news