REAKING : నేపాల్‌ లో కుప్పకూలిన విమానం..30 మంది ప్రయాణికులు మృతి

-

నేపాల్‌ లో ఓ విమానం కుప్పకూలింది. ఖాట్మాండు నుంచి పొఖారా వెళుతున్న సమయంలో.. ఈ విమానం కుప్పకూలిందని సమాచారం అందుతోంది.విమానం ల్యాండింగ్‌ జరిగే సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో.. విమానంలో 72 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని సమాచారం అందుతోంది.

అయితే, నేపాల్ లోని పోకారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో విమానం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికి తీశారు. విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ బహదూర్ తెలిపారు. వీరు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు చాలా తక్కువ అని ఆయన తెలిపారు. వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news