వచ్చే ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ.. అక్కడి నుంచేనా..!

-

జబర్దస్త్ వేదిక ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హైపర్ ఆది.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభలో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలకు చెమటలు పట్టించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా రణస్థలంలో జరిగిన ఈ బహిరంగ సభలో హైపర్ ఆది స్పీచ్ చూసిన తర్వాత కచ్చితంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయం అన్నట్టుగా కనిపిస్తోంది. మొదటినుంచి జనసేన పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ పై విమర్శలు వచ్చినపుడు ఏ రోజు కూడా సహించలేదు. వెంటనే సోషల్ మీడియా, జబర్దస్త్ వంటి వేదికల ద్వారా ప్రత్యర్థులపై చెలరేగిపోవడం మనం చూస్తూనే ఉన్నాము.

ఇప్పుడు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే యువశక్తి సభ వేదికపై హైపర్ ఆది మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన ప్రసంగం జనసేన కార్యకర్తలలో ఉత్తేజం నింపింది. అయితే ఆయన స్పీచ్ విన్న తర్వాత హైపర్ ఆదికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన వర్గాలలో వినిపిస్తున్న ఆసక్తికర వార్త ఏమిటంటే 2024 ఎన్నికలలో హైపర్ ఆది టికెట్ పై పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

ఏ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేశారని.. జనసేన వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి . ముఖ్యంగా హైపర్ ఆది ప్రకాశం జిల్లాకు చెందిన వాడు కాబట్టి ఆ జిల్లా నుంచి ఆయనకు సీటు కేటాయిస్తున్నారట. దర్శి నియోజకవర్గం నుండి హైపర్ ఆది పోటీ చేయడం ఖాయం అంటూ ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news