నా అకౌంట్లు ఎవరో హ్యాక్ చేశారు: సుప్రియా శ్రీనతే

-

బాలీవుడ్ బ్యూటీ, బీజేపీ నేత కంగన రనౌత్పై కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనతే చేసిన వివాదాస్పద పోస్ట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పోస్ట్ పై సుప్రియా స్పందించారు. ఎవరో తన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ చేసి, తప్పుడు పోస్టులు పెట్టారని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. తాను మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తానో సన్నిహితులకు తెలుసని తెలిపారు. తన పేరుతో ట్విటర్లో ఉన్న పేరడి అకౌంట్పై రిపోర్ట్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

కాగా, తనను ‘వేశ్య’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సుప్రియా శ్రీనతేపై కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్టిస్ట్గా నా కెరీర్లో నేను అన్ని రకాల పాత్రలు పోషించాను అని గుర్తు చేశారు. సెక్స్ వర్కర్లను దూషించడం మానుకోవాలి. ప్రతి మహిళా ఆత్మగౌరవం కోరుకుంటుంది’ అని ఆమె ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.కంగనాను ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news