ముఖ్యమంత్రిని గద్దెదించడమే నా లక్ష్యం – పొంగులేటి

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సిబిఐకి లేదా సిట్టింగ్ జడ్జీ తో విచారణ చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పరీకలు రద్దు చేసి విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ రెండు నెలల్లో ఎగ్జామ్స్ పెట్టి అర్హులైన వారికి ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

2018 ఎన్నికల్లో నిరుద్యోగ బృతి హామీ ఇచ్చారు కానీ.. ఒక్క రూపాయ నిరుద్యోగ బృతి ఇవ్వలేదని మండిపడ్డారు పొంగులేటి. ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ నిరుద్యోగులు గుర్తుకు వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, నిదులు , నియమాకాలు , భద్రాచలం దేవాలయ అభివృద్ది జరుగలేదన్నారు.

నిదులు, నీళ్లు, నియమాకాలు అన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయని… ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జెండా ఏది అయిన ఎజెండా ఒక్కటేనని.. రాష్ర్ట ముఖ్యమంత్రి ని గద్దెదించడమే తన లక్యం అన్నారు పొంగులేటి. తప్పకుండా ఆ నిర్ణయం త్వరలోనే చెబుతానని.. దగ్గరలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల కోరికకు అనుగుణంగానే తన నార్ణయం ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news