ఓటీటీలోకి నా సామిరంగ “స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే…?

-

ఇటీవల కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా సామిరంగ’.ఈ మూవీ జనవరి 14న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయింది.అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. అయితే ఎప్పటి నుంచి అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బహుశా ఫిబ్రవరి 12 లేదా 15 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. థియేటర్ల లో రూ.50 కోట్లు సాధించిన ఈ మూవీని ఓటీటీ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news