మ‌రోసారి జోడీక‌ట్ట‌బోతున్న నాగ‌ చైతన్య – పూజా హెగ్డే!

-

అక్కినేని హీరో నాగ చైత‌న్య, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే కాంబినేషన్ లో దాదాపు ఏడు సంవ‌త్స‌రాల క్రితం ఒక లైలా కోసం సినిమా చేశారు. దీని త‌ర్వాత పూజా హెగ్డేకు వ‌రుస‌గ అవ‌కాశాలు వ‌చ్చాయి. క‌ట్ చేస్తే.. టాలీవుడ్ అగ్ర హీరోయిన్ల జాబితాలోకి వెళ్లి పోయింది. అలాగే నాగ చైత‌న్యకు కూడా ఒక లైలా కోసం సినిమా కేరీర్ పరంగా పెద్ద విజ‌యాన్ని అందించింది. దీని త‌ర్వాత కొన్ని సినిమాలు రాణించక పోయినా.. ఇటీవ‌ల వ‌చ్చిన మ‌జిలీ, ల‌వ్ స్టోరి వంటి సినిమాల‌తో ప్ర‌త్యేక క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చ‌ద్దా సినిమాలో న‌టించే స్థాయికి ఎదిగాడు. కాగ చైతూ – పూజా మ‌రోసారి జోడీ క‌ట్ట‌బోతున్నార‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య థ్యాంక్ యూ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భుతో ఒక సినిమా చేయ‌నున్నాడు. కాగ ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను చిత్ర బృందం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ త్వ‌ర‌లోనే చిత్ర బృందం ఈ సినిమా గురించి ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని తెలుస్తుంది. కాగ రెండో సారి జ‌త కట్టి చేయ‌బోతున్న సినిమా.. ఎంత హిట్ అవుతుందో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news