నాగచైతన్య ఇప్పుడు హ్యాపీగా కనిపిస్తున్నాడు. నాకది చాలు : నాగార్జున

-

అక్కినేని నాగచైతన్య, సమంత జోడీ విడిపోయి చాలాకాలం అయినా ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. వారు ఎందుకు విడిపోయారన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో, జాతీయ మీడియా సంస్థ ‘పింక్ విల్లా’ నాగార్జునను ఈ అంశంపై స్పందించాలని కోరింది. అందుకు నాగార్జున స్పందిస్తూ.. నాగచైతన్య ఇప్పుడు హ్యాపీగా కనిపిస్తున్నాడని సమాధానం ఇచ్చారు. నాకది చాలని, అంతకంటే నేను ఇంకేమీ కోరుకోనని నాగార్జున అన్నారు. గతంలో అతడి జీవితంలో జరిగిన వ్యవహారం అంటారా…. అదొక అనుభవమని, దురదృష్టకరమైనదంటూ నాగార్జున వ్యాఖ్యానించారు. దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోలేమన్న నాగార్జున.. ఆ వ్యవహారం ముగిసిపోయిందన్నారు.

మా జీవితాల నుంచి తీసేశామని, ఇతరులు కూడా దాని గురించి ఇక ఆలోచించరని భావిస్తున్నాం అని వ్యాఖ్యానించారు నాగార్జున. టాలీవుడ్ లో అందాల జంటగా గుర్తింపు పొందిన నాగచైతన్య, సమంత చాలాకాలం పాటు ప్రేమించుకుని, 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి గోవాలోని ఓ రిసార్ట్ లో హిందూ పద్ధతిలోనూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు జరిగింది. పెళ్లి రిసెప్షన్ కూడా హైదరాబాదులోనూ, చెన్నైలోనూ ఘనంగా నిర్వహించారు. కానీ, కొన్నేళ్ల తర్వాత వీరి కాపురంలో కలతలు బయల్దేరాయి. విభేదాలు తీవ్రరూపు దాల్చడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version