నందిగామ పీస్ వద్ద టీడీపీ ఆందోళన..!

-

కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ ఎదురుగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టిడిపి నేతలు కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. అయితే ఈ మధ్య వైకాపా నిర్వహించిన సభలో తంగిరాల సౌమ్య పై అనుచిత వీడియోలని ప్రదర్శించారట దీనికి కారణమైన వైకాపా నేతలు కరిముల్లా షేక్ యాకూబ్ అలీపై చర్యలు తీసుకోవాలని కోరారు రెండు రోజుల క్రితం ఆమె కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిరసిస్తూ తెలుగుదేశం నేతలు పిఎస్ ఎదుట ఆందోళనకి దిగారు.

సీఎం జగన్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ఎమ్మెల్సీ అరుణ కుమార్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. నిందితుల్ని అరెస్ట్ చేయకపోతే ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. తెదేపా నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస్ రావు పై నందిగామ రూరల్ సీఐ నాగేంద్రరావు దుర్భాషలాడడం జరిగింది. దీనిపై తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులకు వ్యతిరేకంగా తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version