మా నాన్న తర్వాతే ఎవరైనా.. బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి కామెంట్స్

-

మా నాన్న తర్వాతే ఎవరైనా అంటూ బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి ఆసక్తి కర కామెంట్స్ చేశారు. నందమూరి బాలయ్య ,గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా వీర సింహారెడ్డి..భారీ అంచనాలతో ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఉదయం 4 గంటలకే మొదటి షో పడింది..ఎప్పటిలాగే ఫ్యాన్స్ హంగామా తారా స్థాయికి చేరింది..సంక్రాంతి పండగను అభిమానులకు రెండు రోజుల ముందే తెచ్చింది ఈ చిత్రం.

తెలంగాణ ప్రభుత్వం ఆరో షోకి అనుమతి ఇవ్వడంతో.. తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు మొదలయ్యాయి. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో సాగింది. కాగా, ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూడటం కోసం నందమూరి కుటుంబం వారి సెంటిమెంట్‌ థియేటర్‌ అయిన హైదరాబాద్‌ కూకట్‌ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో సందడి చేశారు. అభిమానులతో కలిసి.. వీర సింహా రెడ్డి సినిమాను నారా బ్రాహ్మణి చూశారు. ఇక ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ, సినిమా చాలా బాగుందన్నారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news