హాసనలో ప్రజ్వల్‌ రేవణ్ణ ఆధిక్యం

-

దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠ పెంచుతోంది. వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు కర్ణాటకలోని హవేరిలో కర్ణాటక మాజీసీఎం బస్వరాజ‌్ బొమ్మై లీడింగ్‌లో ఉన్నారు. ఇంకోవైపు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రజ్వల్.. లైంగిక దాడి కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తి నెలకొల్పుతున్న స్థానాల్లో హాసన్ స్థానం ఒకటి. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ ఎన్డీఏ కూటమి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రజ్వల్‌కు సంబంధించిన లైంగిక దాడులు, వేధింపులకు సంబంధించిన అసభ్యకర వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై కర్ణాటక సర్కార్ సిట్ కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజ్వల్ విదేశాలకు పరారవ్వగా.. ఇటీవలే మళ్లీ భారత్‌కు తిరిగివచ్చారు. బెంగళూర్‌కు వచ్చిన ప్రజ్వల్‌ను అధికారులు ఎయిర్‌ పోర్టులోనే అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news