అయోధ్య రామయ్యకు కానుకగా 1,100 కిలోల ఢమరుకం

-

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి భక్తుల నుంచి ఇంకా కానుకలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్‌ జన్‌ కల్యాణ్‌ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని రామయ్యకు కానుకగా సమర్పించింది. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది. ఈ తబలాను వాయించినప్పుడు దీని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ తబలాకు ఇప్పటికే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కిందని శివ బరాత్‌ జన్‌ కల్యాణ్‌ సమితి బృందం వెల్లడించింది. ఇది 6 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పు ఉందని తెలిపింది. దీనిని తయారు చేయడానికి 3 నెలల సమయం పట్టిందని పేర్కొంది. అలీగఢ్, కాన్పుర్, ప్రయాగ్‌రాజ్‌, మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలకు చెందిన కళాకారులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం కళాకారులు కూడా ఈ తబలా తయారీలో పాల్గొన్నారని చెప్పింది. మరోవైపు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన కొందరు రామ భక్తులు 6.9 అడుగుల ప్లైవుడ్‌పై హనుమాన్‌ చాలీసాను చెక్కి అయోధ్యకు తీసుకువచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version