BREAKING : యూపీలో ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు.. 18 మంది దుర్మరణం

-

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఉన్నావ్‌ జిల్లాలోని లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇవాళ ఉదయం 5.15 గంటలకు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్‌ను డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొట్టడంతో 18 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. బాధితులకు బంగార్‌మావ్‌ సీహెచ్‌సీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. బిహార్‌ నుంచి దిల్లీకు వెళ్తున్న డబుల్‌ డెక్కర్‌ బస్సు ఉన్నావ్లోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధా గ్రామం ముందు ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి కారణంగా అతివేగంగా వెళ్లడమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు’ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news