BREAKING: నీటిలో కొట్టుకుపోయిన ఐదుగురు జవాన్లు

-

5 Army soldiers killed during tank exercise near LAC in Ladakh:  నీటిలో కొట్టుకుపోయారు భారత జవాన్లు. లడఖ్‌లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో విషాదం చోటుచేసుకుంది. యుద్ధ ట్యాంకర్ నదిని దాటుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది.

5 Army soldiers ,LAC in Ladakh

దీంతో ఐదుగురు జవాన్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. నీటిలో కొట్టుకుపోయిన ఐదుగురు జవాన్లు మరణించారని సమాచారం.  లేహ్‌కు 130 కి. మీ దూరంలో ఘటన జరిగింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఈ సంఘటన పై రక్షణ అధికారులు స్పందించారు. “సంఘటన సమయంలో ట్యాంక్‌లో ఒక JCO మరియు 4 జవాన్లతో సహా ఐదుగురు సైనికులు ఉన్నారు. ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతుండగా ఒకరి ఆచూకీ లభించింది” అని రక్షణ అధికారులు తెలిపారు. గత సంవత్సరం, వారు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్, లేహ్ జిల్లాలోని కియారీ సమీపంలోని లోతైన లోయలో పడిపోవడంతో, ఒక JCO సహా తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news