లడఖ్లో నీటిలో కొట్టుకుపోయిన ఐదుగురు జవాన్లు మృతి..!

-

లడఖ్‌లో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద యుద్ధ విన్యాసాల్లో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్(JCO)తో సహా ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. లెహ్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలో యుద్ధ ట్యాంకర్ T-72 నదిని దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

5 Army soldiers ,LAC in Ladakh

ఇక ఈ సంఘటన పై రక్షణ అధికారులు స్పందించారు. “సంఘటన సమయంలో ట్యాంక్‌లో ఒక JCO మరియు 4 జవాన్లతో సహా ఐదుగురు సైనికులు ఉన్నారు. ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతుండగా ఒకరి ఆచూకీ లభించింది” అని రక్షణ అధికారులు తెలిపారు. గత సంవత్సరం, వారు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్, లేహ్ జిల్లాలోని కియారీ సమీపంలోని లోతైన లోయలో పడిపోవడంతో, ఒక JCO సహా తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news