Hajj Pilgrims: హజ్‌ యాత్రలో 550 మంది యాత్రికులు మృతి

-

550 pilgrims died in Hajj: BREAKING: హజ్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకంగా 550 మంది యాత్రికులు మృతి చెందారు. ఈ ఏడాది హజ్ యాత్రలో ఇప్పటివరకు 550 మందికిపైగా యాత్రికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో అత్యధికంగా 323 మంది ఈజిప్షియన్లు ఉన్నారని పేర్కొన్నారు.

550 pilgrims died in Hajj

తీవ్ర ఎండలు, ఉక్కబోత వాతావరణమే మరణాలకు కారణమని చెప్పారు. 22 దేశాలకు చెందిన 16 లక్షల మందితో కలిపి ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని వెల్లడించారు. కాగా, గత ఏడాది 240 మందికిపైగా యాత్రికులు మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news