ఒడిశాలో నవీన్ పట్నాయక్ కి షాక్.. గెలుపు దిశగా బీజేపీ

-

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. అధికార బీజూ జనతాదళ్ అధికారానికి బ్రేకులు పడేలా కన్పిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ దూసుకెళ్తుంది మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ లీడ్లో కొనసాగుతోంది. 72 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 61 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుంది.

కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఐదు రౌండ్ల వరకు వెనకంజలోనే ఉన్నారు. హింజిలి, కాటాబంజి అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన బరిలో నిలిచారు. కాగా.. హింజిలోలో నవీన్ పట్నాయక్ ముందు నుంచి ఆధిక్యంలోనే కొనసాగారు. కాటాబంజిలో 5 రౌండ్ల వరకు వెనుకంజలో నిలిచారు. ఆరో రౌండ్లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ప్రస్తుతం, అక్కడ 848 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news