BREAKING: ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..

-

ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆప్‌ పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ ఆఫీస్‌కు బయల్దేరారు కేజ్రీవాల్, ఆప్‌ నేతలు. ఈ నేపథ్యంలోనే ఆప్‌ కార్యాలయం దగ్గరే కేజ్రీవాల్, ఆప్‌ నేతలను అడ్డుకున్నారు పోలీసులు.

AAP leaders workers hold a protest against the BJP in Delhi

దీంతో ఆప్‌ కార్యాలయం ముందే బైఠాయించారు కేజ్రీవాల్‌, ఆప్ నేతలు. ఆప్‌ నేతలందరినీ జైల్లో పెట్టండి అంటూ ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఫైర్‌ అయ్యారు. బీజేపీ ఆఫీసుకు ర్యాలీగా వెళ్తామని ప్రకటించారు. అడ్డుకుంటే అక్కడే బైఠాయిస్తాం.. అరగంట వేచిచూస్తామని కేజ్రీవాల్‌ వెల్లడించారు. మమ్మల్ని అరెస్ట్ చేయకుంటే బీజేపీ ఓడిపోయినట్టేనంటూ స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. దీంతో ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news