జీ-20 విందుకు ఆమె వెళ్లకపోయుంటే.. ఆకాశమేమీ ఊడిపడేది కాదుగా .. దీదీపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్

-

పశ్చిమ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్వహించిన జీ20 విందుకు మమతా హాజరు కావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో కీలక నేత అయిన ఆమె.. ఈ విందుకు హాజరుకావడంపై అధీర్ ధ్వజమెత్తారు.

‘జీ-20 విందుకు ఆమె వెళ్లకపోయుంటే.. ఆకాశమేమీ ఊడి పడేది కాదు. ఆమె ఈ విందులో పాల్గొనడానికి ఇంకేమైనా కారణం ఉందా..? పలువురు విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు ఈ విందు కార్యక్రమంలో పాల్గొనడం మానుకున్నారు. అయితే మమతా బెనర్జీ విందుకు ముందుగానే దిల్లీ చేరుకోవడంపై ఆంతర్యం ఏంటో. అని అధీర్‌ రంజన్‌ చౌధరి అన్నారు.

అధీర్‌ రంజన్‌ చౌధరి వ్యాఖ్యలకు టీఎంసీ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్‌ స్పందించారు. ‘పశ్చిమ బెంగాల్ సీఎం ఎప్పుడు వెళ్లాలనేది మీరు నిర్ణయించరని అన్నారు. ఆమె ఇండియా కూటమిలో ఒకరని అందరికి తెలుసనీ.. ఆమె ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రొటోకాల్‌ను అనుసరించారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news