ఆరేళ్లలో బీజేపీకి రూ.10వేల కోట్ల విరాళాలు.. BRS, YCPలకు ఎంతంటే..?

-

రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ వెల్లడించింది. ఈ విరాళాల్లో సగానికి పైగా ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలోనే వస్తున్నట్లు తెలిపింది. 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలకు రూ.16,437 కోట్ల విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. అందులో రూ.9,188 కోట్లు కేవలం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలోనే వచ్చినట్లు తెలిపింది.

ఇతర జాతీయ పార్టీల కంటే బీజేపీకే ఎక్కువ విరాళాలు లభించినట్లు ADR తెలిపింది. బీజేపీకి రూ.10,122 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1,547కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.823 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్‌ తన నివేదికలో వెల్లడించింది. మొత్తం విరాళాల్లో 80 శాతం జాతీయ పార్టీలకు రాగా, ప్రాంతీయ పార్టీలకు 19.75 శాతం విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. ప్రాంతీయ పార్టీలలో బీజేడీకి అత్యధికంగా రూ.622కోట్లు రాగా .. డీఎంకేకు రూ.431 కోట్లు, బీఆర్ఎస్​ పార్టీకి రూ.383 కోట్లు, వైసీపీకి రూ.330 కోట్ల మేర విరాళాలు వచ్చినట్లు ADR తన నివేదికలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news