ఏకంగా పాకిస్తాన్ జట్టుపై 228 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ దెబ్బకు పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ వనికి పోయారు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే…. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. అయితే 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 32 ఓవర్లలో 128 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

అయితే భారత్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో బ్యాక్ బ్యాట్స్మెన్ సల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో హెల్మెట్ లేకుండా ఆడిన సల్మాన్… స్వీప్ షాట్ ఆడి క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ తరుణంలోనే బాల్ ఒక్కసారిగా బౌన్స్ అయి అతని మొఖానికి తగలడంతో రక్తం కారింది. ఈ సంఘటన జరగగానే అందరూ షాక్ కు గురయ్యారు. వెంటనే అతనికి కంకేసన్ టెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో 24 ఓవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ గాయం అనంతరం బ్యాటింగ్ చేసిన సల్మాన్ వెంటనే అవుట్ అయ్యాడు.
https://x.com/SajjanarVC/status/1701284096415244594?s=20