దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం.. అక్కడికక్కడే 10 మంది దుర్మరణం

-

దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన గుజరాత్​లోని రాజ్‌కోట్-అహ్మదాబాద్ హైవేపై బగోదర గ్రామంలో చోటుచేసుకుంది. మినీ ట్రక్కు-లారీ ఢీకొన్న ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అహ్మదాబాద్​ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా  ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వెళుతున్న మినీ ట్రక్కు.. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. దీని వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు వెల్లడించారు. ఘటనపై స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే.. ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు వివరించారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news