ఫస్ట్‌ టైమ్‌ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఆఫర్‌

-

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీ అయ్యారు. మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో మునిగిపోయారు. రేపటి నుంచి తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ తన వంతుగా ఓ ముందడుగేసింది. తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ, ఇంటర్నేషనల్‌ సర్వీసుల టికెట్‌ ధరలపై వారికి 19 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

ఈ ఆఫర్ పొందాలనుకుంటున్నారా..?

ఈ ఆఫర్‌ పొందాలనుకునేవారు 18 నుంచి 22 ఏళ్ల వయసువారై ఉండాలని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

మొబైల్‌ యాప్‌, కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి టికెట్‌ బుక్‌ చేసుకోవాలి.

ఏప్రిల్‌ 18వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ మధ్య ప్రయాణించాలి.

ఓటు వేయబోయే నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టు గమ్యస్థానమై ఉండాలి.

ఆఫర్‌ పొందడం కోసం ఐడీ సహా సంబంధిత పత్రాలు చూపించాలి.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లోని ఎక్స్‌ప్రెస్‌ లైట్‌, ఎక్స్‌ప్రెస్‌ వాల్యూ, ఎక్స్‌ప్రెస్‌ ఫ్లెక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బిజ్‌.. ఇలా నాలుగు కేటగిరీలకూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news