బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్కు మంత్రి పొన్నం సవాల్

-

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు సవాల్ విసిరారు. వినోద్ కుమార్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో వినోద్ కుమార్ ఏం మాట్లాడారో, కాంగ్రెస్ ఎంపీలు ఏం మాట్లాడారో చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ విసిరారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని నిలదీయండని ప్రజలకు పిలుపునిచ్చారు.

గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అమలు చేస్తున్న గ్యారంటీలపై బాగా ప్రచారం చేయాలని అభ్యర్థులకు సూచించారు. రైతులకు బోనస్‌ తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో కేసీఆర్‌ ఏడు లక్షల కోట్లు అప్పు చేశారన్న మంత్రి.. కేసీఆర్‌ దుర్మార్గ పాలనకు బీజేపీ కూడా సహకరించిందని ఆరోపించారు. బీజేపీ పదేపదే అయోధ్య రామాలయం అంశాన్ని తీసుకొస్తోందని, మనమంతా హిందువులం కాదా.. శ్రీరామనవమి మనమంతా జరుపుకోలేదా? అని ప్రశ్నించారు. తల్లులు గురించి హీనంగా మాట్లాడిన చరిత్ర బండి సంజయ్‌ది అని విమర్శించారు. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధర్మపురికి ప్రసాద్‌ పథకం నిధులు ఇవ్వలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news