నేడే అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం.. అతిథులు వీళ్లే

-

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహ మహోత్సవం ఇవాళ అట్టహాసంగా జరగనుంది. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఈ వేడుక నిర్వహించనున్నారు.  ఈ వేడుకకు దేశదేశాల నుంచి ప్రముఖ నటీనటులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు అతిథులుగా వస్తున్నారు. ఇప్పటికే వీరంతా ముంబయి చేరుకున్నారు.

హాలీవుడ్‌ తారలు కిమ్‌ కర్దాషియన్, ఖ్లో కర్దాషియన్, ప్రియాంకా చోప్రా-నిక్‌ జొనాస్‌ దంపతులు, బాక్సర్‌ మైక్‌ టైసన్, బాలీవుడ్‌ తారలు అమితాబ్‌ బచ్చన్, ఆమీర్‌ ఖాన్, ఐశ్వర్యా రాయ్‌-అభిషేక్‌ బచ్చన్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌ తదితరులు హాజరుకానున్నారు. వీరితోపాటు బ్రిటన్‌ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్‌ జాన్సన్, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాన్‌ కెర్రీ, స్వీడన్‌ మాజీ ప్రధాని కార్ల్‌ బిడ్త్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్‌ హార్పర్, టాంజానియా అధ్యక్షురాలు సామి సులుహు హస్సన్, ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్‌ ఆంటోనియో, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్‌ఫాంటినో వంటి ప్రముఖులు రానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news