భారత్‌లో మరో రెండు మంకీపాక్స్‌ కేసులు.. ఆ రాష్ట్రాల్లోనే

-

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ వైరస్‌ భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది. ఈ ఒక్కరోజే మరో రెండు కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరింది. మంకీపాక్స్‌ లక్షణాలతో మొన్ననే కేరళలో ఒకరు మృతిచెందగా.. కొత్తగా అక్కడ మరో వ్యక్తి(30 ఏళ్లు)లో ఈ వైరస్‌ లక్షణాలు వెలుగుచూశాయి.

జులై 27న యూఏఈ నుంచి కాలికట్‌ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్‌ వెల్లడించారు. మలప్పురంలోని ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నామని.. ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. అతడితో సన్నిహితంగా తిరిగిన కుటుంబ సభ్యులు, స్నేహితులను మానిటరింగ్‌ చేస్తున్నట్టు చెప్పారు. తాజాగా నమోదైన కేసుతో కేరళలో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 5కి చేరింది.

దేశ రాజధాని నగరంలో కొత్తగా మరొకరికి మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ వెల్లడించారు. విదేశీ పౌరుడైన 35 ఏళ్ల వ్యక్తికి దిల్లీలో మంకీపాక్స్‌ పాజిటివ్‌ వచ్చిందని..  ఇటీవలి కాలంలో అతడికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని రాజ్యసభలో వెల్లడించారు. తాజా కేసుతో కలిపి దిల్లీలో ఇప్పటివరకు నమోదైన మంకీపాక్స్‌ కేసుల సంఖ్య మూడుకు చేరగా.. దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ బాధితుల సంఖ్య 8కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news